సిరా న్యూస్,రాజన్నసిరిసిల్ల;
వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం బుధవారం నాడు జరిగింది. ఆలయ అర్చకులు శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నేడు స్వామివార్లకు ద్వజారోహణం, ఎదుర్కోళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10:50 ని నుండి 12:00 శుభ ముహూర్తమున స్వామి వారల శివకళ్యాణం జరిగింది. ఆలయ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెళ్లి పందిరిలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి తిలకించడానికి వేలాదిగా శివపార్వతులు, భక్తులు వచ్చారు