ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి

సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ బలగాలకు, లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ సభ్యులు మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఘటనలో ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయింది. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. చత్తీస్గడ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న నాయకత్వంలో దళం సంచరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *