జిల్లా మహాసభ ను జయప్రదం చేయండి
సిరా న్యూస్,నంద్యాల;
చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు ఆకుమల్ల రహీమ్ ,అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా అధ్వర్యంలో జరిగిన కార్యవర్గ సమావేశం లో ఏకగ్రీవం గా తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 18/12/2023 వ తేది సోమవారము శోభ లాడ్జి ప్రక్కన ,సిటీ కేబుల్ ఆఫీస్ వద్ద గల చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యాయంలో నంద్యాల జిల్లా మహా సభ నిర్వహించు కొనుటకు నిర్ణయం తీసుకోవడం జరిగినది.కావున నంద్యాల పట్టణము లోని చిరు వ్యాపారులు అనగా ,తోపుడు బండ్లు పై వ్యాపారం చేసుకొనువారు, , బుట్టలు పైన వ్యాపారం చేయువారు మరియు ఫుట్ పాత్ ల పై వ్యాపారం చేసుకోను చిరు వ్యాపారులు అందరూ కూడా చిన్న వ్యాపారులే కావున వీరందరూ ఎక్కువ సంఖ్య లో హాజరై మహా సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు.మన చిరు వ్యాపారుల అనేక సమస్యల పరిష్కారం కోసం మన ఐక్యత చాలా అవసరం.రోజువారీ గేట్లు ఎత్తివేత,,వడ్డీలేని రుణాలను మంజూరు చేసుకోవడం, చిరువ్యపారులు గౌరవంగా వ్యాపారం చేసుకునే విధముగా ప్రభుత్వ స్థలం కేటాయించడం,,మరియు సొంత ఇండ్లు లేని వారికి ప్రభుత్వం చే ఇండ్లు కట్టించుకో వడం తదితర సమస్యలు సాధించుకోవాలని మన చిరు వ్యాపారులు అందరూ ఇక్యమత్యం తో ఉంటే సాడించుకోవచ్చు.కావున పైన తెలిపిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సంఖ్య లో హాజరై మహా సభను జయప్రదం చేయాలని కోరారు….ఈ కార్య క్రమం లో అధ్యక్షుడు,సత్యనారాయణ గుప్తా, అధ్యక్షులు ఆకుమల్ల రహీమ్, ప్రధాన కార్యదర్శి మదార్ వలి, కోశాధికారి నారాయణ,ఉపాధ్యక్షులు సంజీవ రాజు, సభ్యులు నబిరసూల్, మోడిన్ , తిరుమలేశు,ఆటోనగర్ వాసు,N G O S కాలనీసాయి , ఆచారి ,రాముడు,తదితరులు పాల్గొన్నారు.