సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధి మందలపల్లి రాష్ట్రీయ రహదారి వద్ద ఒరిస్సా నుండి నాసిక్ కు తరలిస్తున్న గంజాయి ని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ తో ఉన్న డిసిఎం వాహనంలో కెమికల్ లోడ్ లో కింద భాగంలో 275 ప్యాకెట్లలో 508 కేజీల గంజాయి ప్యాకెట్ లను ఉంచి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, దమ్మపేట పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నాసిక్ జిల్లాకు చెందిన 12 మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఒడిస్సా నుండి నాసిక్ వరకు ఈ గంజాయి రవాణా చేస్తున్నారని, ఇలా తరలించిన గంజాయి ని పూణే ,ముంబై రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసిందని, ఈ ముఠాలో ఆరుగురు వ్యక్తులను పట్టుకోగా మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.