– అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్
సిరా న్యూస్,పెద్దపల్లి;
సామాజిక సేవలో పాలుపంచుకోవడం అభినందనీయమని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. పెద్దపల్లి రెసిడెంట్స్ టీచర్స్ ఆధ్వర్యంలో పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ వద్ద మానస గంగోత్రి వాటర్ ప్లాంట్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రారంభించారు. అలాగే ఉగాది పర్వదినం సందర్బంగా ఉగాది పచ్చడి, భక్ష్యాలు అదనపు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ పెద్దపల్లిలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులందరూ వారి వారి సంఘాలకు అతీతంగా ఐక్యంగా పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు సామజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. వేసవి కాలంలో ప్రజల దాహర్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గాన్ని, అసోసియేషన్ సభ్యులను అదనపు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సాదుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వేగోళం సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు వి. హనుమంతు, పెద్దపల్లి మండల విద్యాధికారి సురేందర్ కుమార్, కార్యవర్గ సభ్యులు మహేందర్ రెడ్డి, కర్రే ప్రవీణ్, కనకయ్య, కిషన్ రెడ్డి, సంపత్ రెడ్డి, మెతుకు తిరుపతి, కర్నె రాజు, ఫణిందర్, సలహాదారులు చాట్ల ఆగయ్య, సీనియర్ సభ్యులు రాంరెడ్డి, జీవన్ రాజు, అల్లేంకి సత్యనారాయణ, జితేందర్ రెడ్డి, తాళ్ల నరేందర్, ఆరెపల్లి కుమారస్వామి, సభ్యులు పాల్గొన్నారు.