సిరాన్యూస్, బోథ్
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
* జిల్లా కోఆర్డినేటర్ వెండి సోమేశ్వర్
* గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం
అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలని నెహ్రు యువజన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ వెండి సోమేశ్వర్ అన్నారు. శుక్రవారం బోథ్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారీ శక్తి కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాలికలు అన్ని రంగాల్లో రాణించినట్లయితే భవిష్యత్తులో ఉన్నతులుగా ఎదిగే వీలు ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రన్నింగ్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.