సిరాన్యూస్,ఇంద్రవెల్లి :
బౌద్ధ భంతే మహాథేరో సుమేద్ బోధి మృతి సమాజానికి తీరని లోటు
*మహామాయా ఉపాసిక సంఘం మండల అధ్యక్షురాలు సోమోరే మాయాబాయి
మహాథేరో పూజ్య భంతే సుమేద్ బోధి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని మహామాయా ఉపాసిక సంఘం మండల అధ్యక్షురాలు సోమోరే మాయాబాయి అన్నారు.శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మిలిందనగర్ కాలనీలో గల త్రిరత్న బుద్ధ విహార్ లో మహాథేరో భంతే సుమేద్ బోధి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి,రెండు నిమిషాలు మౌనం పాటించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.మహాథేరో సుమేద్ బోధి మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో బౌద్ధ ధమ్మాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన చేసిన కృషి మరవలేనిదని పేర్కొన్నారు.సకల జనులకు శాంతి, అహింస, మైత్రి, కరుణను పంచిన బుద్ధుడి బాటలో నడిచారని తెలిపారు.ఆయన మృతి సమాజానికి తీరని లోటని అన్నారు.ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి వాగ్మారే కాంరాజ్, దళిత సంఘాల నాయకులు మస్కె రాజవర్ధన్,గోపనే ఆనందరావు,మహిళ సంఘం సభ్యులు ప్రభావతి, లత,దురపతా,మాయావతి,ముక్రన్ బాయి,శిలాబాయి,తదితరులు ఉన్నారు.