సిరాన్యూస్, ఇంద్రవెల్లి :
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం : సోన్ కాంబ్లే గోపినాథ్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బయోడైవర్సిటీ బోర్డు కో-ఆర్డినేటర్ సోన్ కాంబ్లే గోపినాథ్ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో అటవీ శాఖ అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని సూచించారు. మొక్కలను నాటడం ద్వారా మనిషి స్వేచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉంటాడని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. భావితరాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.