సిరా న్యూస్, బేల
నిబంధనలకు విరుద్ధంగా వేసిన గుడిసెలను తొలగించాలి
* ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు సోనేరావ్
* పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేత
నిబంధనలకు విరుద్ధంగా వేసిన గుడిసెలను తొలగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు సోనేరావ్ అన్నారు. సోమవారం రాయి సెంటర్ ,ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బేల గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా అధ్యక్షులు సోనేరావ్ మాట్లాడుతూ బురానపూర్ లోని సర్వే నంబర్ 29/ఏ లో గత రెండు సంవత్సరం క్రితం 1/70 చట్టానికి విరుద్ధంగా వేసిన గుడసేలా పై కోర్టు లో కేసు నడుస్తుండగా మళ్ళీ కొందరు గిరిజనేతరులు ఎలా గుడాసెలు వేస్తారని కార్యదర్శికి ప్రశ్నించారు.ఈ గుడిసెలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.లేని యెడల గ్రామ పంచాయతీ వారే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం మెస్రం జంగు మాట్లాడతు ఎన్నికల తర్వాత ఈ సమస్య పరిష్కరించాకపోతే నిరాహార దీక్ష చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కొడప రవి, ఆడా సంతోష్ కోరేంగా జల్పత్, ఫకృ, కాథలే సేకు,మాడావి భీంరావ్, ఈస్రు రాయి సెంటర్ ప్రధాన కార్యదర్శి కొడప భీంరావ్ తదితరులు ఉన్నారు.