Soon the people will turn against the government : త్వరలో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు

కేటీఆర్
 సిరా న్యూస్,హైదరాబాద్;
మహబూబ్నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ – అదానీ వ్యవహారంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్- బిజెపి కుమక్కురాజకీయాలను ప్రజలకు వివరించాలి. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్ బిజెపి కలిసి బీఆర్ఎస్ ను ఓడించాలని, బొంద పెట్టాలని పిలుపునిస్తున్నారు. రాహుల్ గాంధీఏమో మోడీ-అదాని ఒక్కటే అంటున్నారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు . 13 లక్షల కోట్ల రూపాయలు దోచిన అదానీడబ్బులు, అంతా ప్రధానమంత్రి కి, బిజెపికి పోతాయని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడారు. ఎన్నికల ముందు అతని ఒక దొంగ అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అదే రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ సాక్షిగా అదానితో అలైబలై చేసుకుంటున్నాడు. ఈ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ ఢిల్లీలో అదానితో కొట్లాడుతూ… ఇక్కడ మాత్రం ఎందుకు అదానితో కలిసి పనిచేస్తుందో స్పష్టం చేయాలి. అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అన్న కాంగ్రెస్ పార్టీ.. మరి ఇప్పుడు అదే అదానితో ఎందుకు పనిచేస్తుందో చెప్పాలి. బిజెపి ఆదేశాల మేరకే అదానితో ఇక్కడి ప్రభుత్వము, ఇక్కడిముఖ్యమంత్రి కలిసి పని చేస్తున్నారు.అదానిపట్ల మారిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి కారణాలు ఏంటో చెప్పాలి. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సంఖ్య సరిగ్గా 420అయ్యాయని అన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు… మొన్న ఉత్తంకుమార్, రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిన తర్వాత జాతీయ ప్రాజెక్టు ఇవ్వడానికివీలులేదు అని చెప్పారు.పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మావల్ల కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది… ఈ విషయాన్ని మహబూబ్నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలి
మహబూబ్నగర్ కి పక్కనే ఉన్న అప్పర్ బద్ర ప్రాజెక్టుకి కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చిన బిజెపిని నిలదీసే ప్రయత్నం ఉత్తంకుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు. ప్రియాంక గాంధీ 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ… కానీ అసెంబ్లీ సాక్షిగా ఉపముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెబుతున్నారు. ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా ఈరోజువ్యవసాయ శాఖ మంత్రి దశలవారీగా రుణమాఫీ చేస్తామంటున్నారని అన్నారు.
గతంలో రోజుకు పది లక్షల మంది చొప్పున వారం రోజుల్లో 70 లక్షల మందికి రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైన తర్వాత కూడా రైతుబంధు రైతు ఖాతాలలోకి వస్తలేదు. ప్రభుత్వంవచ్చిన కొద్ది రోజుల్లోనే… ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితులు మళ్ళీ వచ్చినయ్. ఎరువులను పోలీస్స్టేషన్లో పెట్టి పంచేపరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *