సిరా న్యూస్,హైదరాబాద్;
ఆర్టీసీ బస్సుల్లో అంధుల కోసం సౌండ్ వాయిస్ సిస్టం ఏర్పాటు చేయనున్నామని మంత్రి సితక్క తెలిపారుఅంధుల ఆరాధ్య దైవం, బ్రెయిలి లిపి సృష్టికర్త డా”లూయిస్ బ్రెయిలి 215వ జన్మదిన సందర్భంగా మలక్పేట లోని దివ్యంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో జరిగిన వేడుకలకు మంత్రి సితక్క ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. దివ్యాంగుల అభివృద్ధి,సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సితక్కఅన్నారు.దివ్యాంగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి మ్యానిఫెస్టోలో రూపొందించిన విధంగా ఉపాధి.ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రోబోయో నోటిఫికేషన్ లలో దివ్యంగుల కోటా పెంచే విధంగా కృషిచేస్తామని తెలిపారు ఈ సందర్భంగా అంధులకు లాప్ టాప్ లు, ఫోన్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలోమలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల, వికలాంగుల శాఖ అధికారులు హాజరు అయ్యారు.