soundarya:పౌష్టికాహారంతో తల్లి బిడ్డల ఆరోగ్యం

సిరా న్యూస్, బోథ్‌
పౌష్టికాహారంతో తల్లి బిడ్డల ఆరోగ్యం
* సిడిపిఓ సౌందర్య
తల్లి బిడ్డల ఆరోగ్యానికి కోసం పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సిడిపిఓ సౌందర్య పేర్కొన్నారు. గురువారం బోథ్‌ మండలంలోని దేవుల నాయక్ తండ గ్రామంలో పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు పిల్లలు సరైన పోషకాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు .అంతేగాక ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రతిరోజు పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు తప్పనిసరిగా పంపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో రామ్ కిషన్ ,సూపర్వైజర్ , అంగన్వాడి ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *