Soyambapurao: గొడం న‌గేష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి: మాజీ ఎంపీ సోయంబాపురావు

సిరాన్యూస్, గుడిహత్నూర్
గొడం న‌గేష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి: మాజీ ఎంపీ సోయంబాపురావు
* గుడిహత్నూర్‌లో బీజేపీ నాయ‌కుల విస్తృత ప్ర‌చారం

బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్య‌ర్థి గొడం న‌గేష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయంబాపురావు అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా గుడిహ‌త్నూర్ మండ‌లంలో దుకాణ సముదాయాలలో మాజీ ఎంపీ సోయం బాపురావు కార్యకర్తలతో క‌లిసి తిరుగుతూ కమలం పువ్వు కి ఓటు వేసి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీ కి బహుమతిగా ఇవ్వాలని కోరారు. నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి అవ‌స‌ర‌మని, మూడవ సారి నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయితే ఆదివాసీలు, దళితులు, బడుగు బలహీన వర్గాల బ‌తుకులు బాగుపడతాయని అన్నారు. ఈ ప్రచారంలో జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్, అధికార ప్రతినిధి కేంద్రే లక్సీమన్, మండల అధ్యక్షులు కేంద్రే శివ, ఎంపీపీ భరత్, ఎంపీటీసీ కోవ జల్పత్, మీడియా ఇంచార్జి కనామే సురేష్, మండల ప్రధాన కార్యదర్శి జగన్, సంబు చాటే,వామన్ గిత్తే, శైలెండర్ వాగ్మారె, వైజనాథ్ కేంద్రే, రాథోడ్ సందీప్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *