SP Akhil Mahajan: నవరాత్రి వేడుకలకు డీజే అనుమతి లేదు: ఎస్పీ అఖిల్ మహాజన్

సిరాన్యూస్‌, రాజన్న సిరిసిల్ల:
నవరాత్రి వేడుకలకు డీజే అనుమతి లేదు: ఎస్పీ అఖిల్ మహాజన్
* శాంతియుత వాతావరణంలో నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి
* నిర్దేశించిన సమయానికే విగ్రాహల నిమజ్జనం పూర్తి చేయాలి

నవరాత్రి వేడుకల్లో డీజీలకు అనుమతి లేదు అని, శాంతియుత వాతావరణంలో నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్ లో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, గణేష్ మండపాల నిర్వహకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు,పాటించవలసిన నియమ నిబంధనాలపై దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ పోలీస్ వారికి సహకరిస్తు శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని,పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులాదని,ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండ ఏర్పాటు చేయలని,సీసీ కెమెరాల ఏర్పాటు వలన ఏ చిన్న సంఘటన జరిగిన గుర్తించవచ్చని అన్నారు.మండపాల వద్ద మద్యం సేవించడం,ఆసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వహకులు పై కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని అన్నారు.ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు,బ్లూ కోల్ట్ సిబ్బంది తరచు మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.ఇనుప వస్తువులతో మండపాలు ఏర్పాటు చేయవద్దని,షాట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,ప్రతి మండపాల నిర్వహకులు విద్యత్ శాఖ అనుమతి తీసుకోవాలనీ అన్నారు.
నవరాత్రి ఉత్సవాలలో డిజే లకు అనుమతి లేదు…
నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల్లో,నిమార్జనం రోజున డీజే లకు అనుమతి లేదని అన్నారు .అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ నిమార్జనం రోజున ఉపయోగిస్టే డీజే వారితో పాటుగా మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఇప్పటికే జిల్లాలో డి.జే యజమానులకు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. స‌మావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *