సిరాన్యూస్, ఆదిలాబాద్
ర్యాగింగ్ చేస్తే చర్యలు తప్పవు: ఎస్పీ గౌష్ ఆలం
* ప్రతి కళాశాల పాఠశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు
విద్యాసంస్థల్లో ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలలో పాఠశాలలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కళాశాల, పాఠశాలలో నూతనంగా వచ్చిన వారిపై ర్యాగింగ్ కు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కేసులు నమోదైతే విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలకు కష్టతరమవుతుందని చెప్పారు. ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. యజమానులు విద్యాసంస్థల్లో విద్యార్థులకు రాగింగ్ పై అవగాహన, వాటి వల్ల కలిగే పరిణామాలపై చైతన్య పరచాలని తెలిపారు. ఎటువంటి అత్యవసర సమయంలోనైనా డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయాలన్నారు.