సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన పి. శ్రీనివాస్ బుధవారం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు… ఈ సందర్భంగా ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలియ జేశారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, లభించిన పదోన్నతి ద్వారా ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించే విధంగా ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్ పాల్గొన్నారు.