సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: ప్రత్యేక అధికారి జి.రవి
ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి
* అంకోలీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటిన అధికారి
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని స్వచ్ఛదనం పచ్చదనం జిల్లా ప్రత్యేక అధికారి, మెంబర్ సెక్రటరీ టీజీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జి. రవి అన్నారు. శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం ప్రత్యేక అధికారి జి.రవి ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో, మున్సిపాలిటీలలో చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం పై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి గ్రామాలను పరిశుభ్రత తో పాటు, సీజనల్ వ్యాధుల పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామస్థాయిలో సానిటేషన్ పక్కాగా నిర్వహించాలని, అంతర్గత రోడ్ల అభివృద్ధి గ్రామాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛత తో పాటు పచ్చదనం కూడా ఉండే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు వహించేలా అవగాహన కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ పరిధిలలో ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది నిత్యం గమనిస్తూ ఉండాలని, ప్రజల ఆరోగ్య సర్వే నివేదిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల అభివృద్ధి కోసం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిందని క్షేత్రస్థాయిలో అధికారులు నిబద్ధతతో పనిచేస్తే అందరికీ మంచి ఫలితాలు అందుతాయని తెలిపారు. జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ, స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలో పక్కాగా నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని ప్రత్యేక అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.అనంతరం అంకొలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియ, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, సంబంధిత అధికారులు సీఈఓ, డీఆర్ డీఓ , ఇరిగేషన్ తదితరులు పాల్గొన్నారు.