సిరా న్యూస్,తిరుపతి;
మాజీ ఎం.పి.పి , ఏ.పి బి.సి స్టేట్ సెక్రటరీ బట్ట రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో కొలువై ఉన్న 12 దివ్య క్షేత్రాలు, గద్వాల్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ తల్లి (శక్తి పీఠం) గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్.డి.ఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్య మంత్రి పదవి అలంకరించాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలియజేశారు .అలాగే సత్యవేడు శాసనసభ్యులు గా కోనేటి ఆదిమూలం గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక పూజలు భాగంగా బట్ట రమేష్ యాదవ్ కార్యాలయం లో ఆలయఅర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.