సిరా న్యూస్,సికింద్రాబాద్;
నూతన సంవత్సరం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మేల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తెలి అరుణ, బీఆర్ఎస్ నేతలతో కలసి సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహాకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తలసాని, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించాలని వెడుకున్నట్లు వెల్లడించారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు పూజలు నిర్వహించి ఎమ్మేల్యే కు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందచేశారు..