Garudeshwara Swamy Temple : గరుడేశ్వర స్వామి ఆలయ విశిష్టత

సిరా న్యూస్, పి.గన్నవరం;
మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవ క్షేత్రాలలో ఒకటైన పి.గన్నవరం లో గరుడేశ్వర స్వామి ఆలయానికి ఒక విశిష్టత ఉంది. గరుడేశ్వర స్వామి ఆలయమునకు ఒక ప్రత్యేకత ఉండటం వల్ల ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు దర్శించుకున్నారు
ఈ ఆలయం విశిష్టత..
పూర్వకాలమున ఒక గరుడ పక్షి ఒక శివలింగమును తీసుకొచ్చి వైనతేయ నది ఒడ్డున పడవేయడంతో అది గమనించిన ఒక ముని అది అత్యంత విశిష్టత కలిగిన శివలింగం. ఈ శివలింగాన్ని ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చి జార విడవడంతో ఈప్రాంతానికి ఏదో విశిష్టత ఉంది అని భావించి గరుడపక్షి తీసుకొచ్చిన లింగం కాబట్టి గరుడేశ్వర లింగంగా దానిని ప్రతిష్టించి అప్పటినుంచి ఇప్పటివరకు పూజలు హోమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.. సాక్షాత్తు పరమేశ్వరుడు గరుడపక్షిచేత తన ప్రతిమను పంపినందుకుగాను ఈ గ్రామంలోకి గరుడవరం అని కూడా పేరు ఉండేది కాలక్రమేణా అది గన్నవరం గా మారింది అని ఇక్కడ స్థానికులు చెబుతుంటారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *