భోగాపురం పోర్టు పనులు వేగవంతం..

సిరా న్యూస్,విజయనగరం;
గాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 4,750 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్దఎత్తున ఆదాయం రానుంది. దీంతో అందరి దృష్టి విమానాశ్రయ నిర్మాణం పైనే పడింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ ఫోర్ట్ నిర్మాణానికి ఈ ఏడాది మే 3న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. కేవలం 36 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయనున్నట్లు నిర్మాణ సంస్థ అధినేత జిఎంఆర్ శంఖుస్థాపన సభావేదికపైనే ప్రకటించారు. అయితే 36 నెలలు కాదు 30 నెలల్లోనే పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జి ఎమ్ ఆర్ ను కోరడంతో అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అలా జి ఎమ్ అర్ హామీ ఇచ్చినట్లే శంకుస్థాపన జరిగిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొదట ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఆలస్యమవుతుందని అంతా భావించారు. అయితే తాజాగా ఉత్తరాంధ్ర వైసిపి ప్రజాప్రతినిధులు మీడియాతో కలిసి భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు పరిశీలించారు. అలా సందర్శించిన ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లోని ప్రగతిని చూసి ఆశ్చర్యపోయారు. భారీ అధునాతన యంత్రాలు, వందలాది మంది కార్మికులతో కలిసి రాత్రింబవళ్ళు పనులు జరుగుతున్నాయి. జరుగుతున్న నిర్మాణ పనులను చూస్తుంటే 2025 డిసెంబర్ నాటికి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తుందిఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మొత్తం 2,203 ఎకరాల భూమిని జిఎంఆర్ సంస్థకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్థలంలో 3.8 కిలో మీటర్ల రన్ వే తో ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *