సిరా న్యూస్,విశాఖపట్నం;
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.గురువారం ఉదయం ఐదు గంటలకు డ్యూటీకి హాజరైన శంకర్రావు, తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావుకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. ద్వారక పీఎస్ పరిధిలో ఘటన జరిగింది.
==============