Sports: ఆటల్లో గెలుపోటములు సహజం

ఆదిలాబాద్, సిరా న్యూస్ 

అట్టహాసంగా ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

అయోధ్య రామ జన్మభూమిలో జరుగుతున్న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో శ్రీ రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో దాదాపు 5 జట్లు పాల్గొనగా మొదటి విజేతగా లింగాపూర్ గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ.జట్టు రెండవ విజేతగా జై భవాని జట్టు గెలుపొందాయి. గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతిగా రూ.3151, రెండవ బహుమతిగా రూ.2151 లను శ్రీ రత్న సాన్వి వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపకులు ఉపారపు సత్యరాజ్  హనుమాన్ మందిరంలో గ్రామ పెద్దల సమక్షంలో అంజజేశారు.అలాగే గెలుపొందిన క్రీడాకారులకు మోడల్స్ ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని యువత తేలిగ్గా తీసుకోవాలని కోరారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీ రంగ్ దేవకతే,విష్ణు కాంత్, కేశవ్, మాధవ్  తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *