సిరా న్యూస్,హైదరాబాద్;
ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోడంలో క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఉద్యోగ సంఘం నాయకుడు జ్ఞానేశ్వర్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓయూలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ క్రీడోత్సవాలను ఓయూ విసి రవీందర్, రిజిస్టర్ లక్ష్మీనారాయణ, డీన్ మల్లేశం లు కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఓయూ మూడు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్రీడా పోటీలకు ప్రతి ఉద్యోగి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. సుమారు 18 క్రికెట్ టీమ్స్, 20 షేటిల్ టీమ్స్, 100కు పైగా క్యారం పోటీలలో ఉద్యోగులు పాల్గొన్నారు అని అన్నారు.