సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ ఎస్ఆర్ డి జి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…
– అంబేద్కర్ కు నివాళులర్పించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు
– అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ డిజి ప్రైవేట్ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపల్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయగీతం ఆలపించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ… భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు మరువలేని అని అన్నారు. విద్యార్థులంతా అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నృత్యాలు, పాటలు, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పలు బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు పాఠశాల ప్రిన్సిపల్ క్రాంతి కుమార్ ఇతర ఉపాధ్యాయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.