హంస , చిలుక, వాహనంపై విహరించిన శ్రీకాళహస్తి స్వామిఅమ్మవార్లు

సిరా న్యూస్;
తిరుపతి జిల్లాలో వెలసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతొంది. నేడు గురువారం ఉదయం హంస ,చిలుక, వాహనాలపై స్వామి అమ్మవార్లు విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామి వారిని హంస వాహనంపై, అమ్మవారిని చిలుకవాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం నాలుగు మాడ వీధుల్లో భక్తుల శివ నామస్మరణలు చేస్తూ డమకరాలు మోగిస్తూ శంఖారావాలు పట్టిస్తూ వాహన సేవను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి, హరహర మహాదేవ్ అంటూ ప్రణమిల్లారు. హంస ఏ విధంగా పాలు నీరును వేరు చేస్తుందో, అదే విధంగా భక్తులలో చెడు గుణాలను తొలగించి మోక్షమార్గంలో సాగేలా చేస్తారని, హంస వాహన విశిష్టతను పురాణాలు తెలుపుతున్నాయి. ఆలయ వేద పండితులు శివప్రసాద్ శర్మ తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *