Srikanth Maharaj: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ

సిరాన్యూస్‌, చిగురు మామిడి:
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ
* కరీంనగర్ జిల్లా ధర్మసమాజ్ పార్టీ ఇంచార్జ్ చిలువేరు శ్రీకాంత్ మహారాజ్

కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ నిలుస్తుందని కరీంనగర్ జిల్లా ధర్మసమాజ్ పార్టీ ఇంచార్జ్ చిలువేరు శ్రీకాంత్ మహారాజ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోటలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.వారు మాట్లాడుతూ పూలే అంబేడ్కర్ కాన్సిరాముల పోరాటం కొనసాగించే ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని తెలిపారు.కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న 90 శాతం బీసీ , ఎస్సీ, ఎస్టీ  ప్రజలు ధర్మసమాజ్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బహుజన రాజ్యం ధర్మ సమాజ్ పార్టీతోనే సాధ్యమైంది తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు జంగం సాధన, ప్రధాన కార్యదర్శి తల్లా నరేష్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా కోశాధికారి ఆరెల్లి బాబు, సదానందం అనిల్, శివాజీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *