సిరా న్యూస్, బోథ్
కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు న్యాయం
* సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్ల శ్రీకాంత్ రెడ్డి
* బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సన్మానం
కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్ల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డుగంగారెడ్డి, వైస్ చైర్మన్ ఆడే వసంత్ లను శుక్రవారం యూత్ కాంగ్రెస్ నల్ల శ్రీకాంత్ రెడ్డి ఏలేటి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈసందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమం లో తేజపూర్ సర్పంచ్ ప్రఫుల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్ల శ్రీకాంత్ రెడ్డి, ఏలేటీ రాజశేఖర్ రెడ్డి, బోథ్ మండల అధ్యక్షులు కుర్మే మహేందర్, సోనాల మండల అధ్యక్షులు గుడాల శేఖర్,,యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుడాల అనీష్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోథ్, అరుణ్ రెడ్డి, నేరడిగొండ ప్రెసిడెంట్ ఈర్ల శ్రీకాంత్, యువనాయకులు మద్దెల మహేష్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.