సిరాన్యూస్, చాందా(టి)
రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
ఎంపీటీసీ బొడగరి శ్రీనివాస్
ఆదిలాబాద్ జిల్లా చాందా(టి) గ్రామం నుండి జాందాపుర్ వరకు ఉన్న ఎక్స్ రోడ్డు గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో ఎంపీ,ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహకారంతో ఎంపీ నిధుల నుంచి నూతన రోడ్డుకు నిధులు మంజురయ్యాయి. శుక్రవారం ఈ రోడ్డు నిర్మాణానికి ఎంపీటీసీ బొడగరి శ్రీనివాస్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోదారి ముత్తన్న, బండారి ప్రమోద్, అరే రాజు, శ్రీనివాస్ శంకర్ , గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.