Srinivas:గోమాస శ్రీనివాస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి:  బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్

సిరాన్యూస్, ఓదెల‌
గోమాస శ్రీనివాస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి:  బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్
మండ‌లంలో బీజేపీ నాయ‌కుల బైక్ ర్యాలీ

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. శ‌నివారం ఓదెలలో పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం ఓదెల మండల బీజేపీ అధ్యక్షులు, కొలనూరు ఎంపీటీసీ కారంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా యువత బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఓదెల మండల కేంద్రం శ్రీమన్నారాయణ దుకాణం నుండి ప్రారంభమైన బైకు ర్యాలీ ఓదెల మండలంలో 22 గ్రామాల లో బైకు ర్యాలీ నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాసును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్ర‌చారం చేప‌ట్టారు. ఈ ర్యాలీలో మెరుగు సారంగం, వంగరి చందు, ఏం బాడీ కుమార్, దాత రాకేష్, తీర్థాల కుమార్, గోపతి సతీష్, రామినేని రాజ్ కుమార్, శ్రీపతి శ్రీనివాస్, రాచర్ల అశోక్, క్యా తం సాయి . తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *