సిరాన్యూస్, ఆదిలాబాద్
ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త పై కేసు నమోదు : ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్
* ఉమెన్ పిఎస్ లో బాధితురాలు ఫిర్యాదు
ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త పై కేసు నమోదు చేసిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్ కే కాలనీకి చెందిన జాస్మిన్ (28) అనే మహిళ 2017 సంవత్సరంలో అబ్దుల్ అతీక్ తో వివాహం జరిగింది. వీరి ఇరువురికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. గత 2 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్యన మనస్పర్ధల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో భర్త అబ్దుల్ అతిక్ పై హరాస్మెంట్ కేసు కూడా నమోదు చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ డబ్ల్యూపీఎస్ తెలిపారు. శనివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో భర్త అబ్దుల్ అతీక్ పై ట్రిపుల్ తలాక్ కేసు సెషన్ 4 ముస్లిం మహిళలు (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం , 2019 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని డబ్లు పీఎస్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.