Srinivas Reddy:ఉద్యోగుల జోలికి వ‌స్తే ఊరుకోం

సిరా న్యూస్, సైదాపూర్
ఉద్యోగుల జోలికి వ‌స్తే ఊరుకోం
* హరీష్ రావు వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం
* ఎన్ని స్కూళ్లలో ఏసీ లు పెట్టిచ్చిండో హ‌రీశ్‌రావు చెప్పాలి
* టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల శ్రీనివాస్ రెడ్డి
ఉద్యోగుల జోలికి వ‌స్తే ఊరుకోమ‌ని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర నాయకులు అన్నారు. రైతు బంధు డబ్బులు ఆపి ఏసీ రూములో కూర్చునే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించింది అంటూ గురువారం మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర నాయకులు తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశారు. శ‌నివారం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ( టి ఆర్ టి ఎఫ్ ) రాష్ట్ర కార్యదర్శు గుర్రాల శ్రీనివాస్ రెడ్డి శనివారం విలేకర్ల సమావేశం లో అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం నిరంతరం పాటు పడుతున్న ఉద్యోగులను ఇది అవమానించడమే రైతు బంధుకు తాము వ్యతిరేకం కాదు అనీ, కానీ రైతులకు ఉద్యోగుల జీతాలకు సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు.గతంలో కూడా బిఆర్ స్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల పై దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని ,ప్రస్తుతం హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయని అన్నారు. కనీస వసతులు లేని పరిస్థితుల్లో పనిచేసే విషయాన్ని మాజీ మంత్రి గుర్తించాలని, గత ప్రభుత్వం జీతాలు ఆలస్యంగా చెల్లించటం మూలంగా బ్యాంక్ లోన్లు సమయానికి కట్టలేక ఫైన్ చెల్లించామని, ప్రస్తుత ప్రభుత్వం దానిని సరిచేస్తుంటే బి ఆర్ స్ నాయకులు ఇలా ప్రజలను ఉద్యోగుల పైకి ఉసిగొల్పి ప్రయోజనం పొందాలనుకోవటం బాధాకరమని అన్నారు. ఇకనైనా ఇలాంటి మాటలు మానుకోవాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *