Srinivas Reddy:ప్రారంభమైన పది పరీక్షలు

సిరాన్యూస్, చిగురుమామిడి
ప్రారంభమైన పది పరీక్షలు
* పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి
* మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి
2023-2024 బ్యాచ్ పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.చిగురుమామిడి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, ఇందుర్తి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఈ రెండు సెంటర్లల్లో విద్యార్థులు పరీక్షలు రాయడానికి హాజరయ్యారు. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిగురుమామిడి లో 222 మంది, ఇందుర్తిలో 55 మంది విద్యార్థులు హాజరయ్యారు.మొత్తం 277 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.277 మంది హాజరయ్యారు.100 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *