సిరా న్యూస్, ఆదిలాబాద్
సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి
* ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి
* ప్రజా సేవాభవన్ కు పోటెత్తిన ప్రజలు
* సమస్యలపై వినతుల స్వీకరణ
సమస్యలు పరిష్కారాని తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజా సేవా భవన్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.నియోజకవర్గం లోని పలు గ్రామాలు ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీల నుండి ప్రజలు క్యాంపు కార్యాలయానికి వచ్చి కంది శ్రీనివాస రెడ్డి ని కలిసారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ప్రజల నుండి పలు వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.