సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు
* పార్టీలోకి ఆహ్వానించిన కంది శ్రీనివాసరెడ్డి
కాంగ్రెస్లో చేరికల పరంపర కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు, కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురు ఆకర్షితులై కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి బీఆర్ఎస్ ఎంపీటీసీ మడవి కిసాన్,వార్డు సభ్యులు కొప్పుల సతీష్, యూత్ అధ్యక్షులు సయ్యద్ ఆఫ్సర్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ల నుండి నోముల చంద్రకాంత్ రెడ్డి,బరుగు గంగన్న ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు.అలాగే పట్టణంలోని 48వవార్డు లోని భుక్తాపూర్ కాలనీ నుండి జ్యోతి ఆధ్వర్యంలో మహిళలతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలం పార్డి – బీ గ్రామస్థులు ,బేలా మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే ఆధ్వర్యంలో మొహబ్బత్ పూర్ గ్రామస్తులు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయని ఆత్రం సుగుణక్క బంపర్ మెజార్టీతో గెలవడం ఖామమని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. అయినా ఈ మూడు రోజులు చాలా కీలకమని నాయకులు కార్యకర్తలు ఎవరుకూడా తమతమ గ్రామాలలోనే ఉండి కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజానికెత్తుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,లోక ప్రవీణ్ రెడ్డి,బాయిన్ వార్ గంగా రెడ్డి,నల్ల గణపతి రెడ్డి,యాల్ల పోతా రెడ్డి,తమ్మల చందు, నలగంటి నవీన్, తల్లెల రాకేష్, సుధాగోని సుధాకర్ గౌడ్,రఫీక్,శంకర్ భోక్రే,కయ్యుమ్, రమేష్, నయాన్ షాహిద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.