Srinivasulu:ఆహింసారహిత ఎన్నికలే లక్ష్యం

సిరా న్యూస్,కళ్యాణదుర్గం
ఆహింసారహిత ఎన్నికలే లక్ష్యం
* ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
* కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు
* కేంద్రసాయుధ బలగాల ఫ్లాగ్ మార్చ్
ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు అన్నారు. శ‌నివారం జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన ఐపీఎస్ ఆదేశాలతో రాయదుర్గం పట్టణంలో కేంద్రసాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వ‌హించారు. క‌వాతు శాంతినగర్, బొడ్రాయి ఏరియా, బళ్లారి బస్టాండ్ ఏరియా, వినాయక సర్కిల్తేరు బజారు సర్కిల్, రాణి సత్రంలక్ష్మీ బజార్రాజీవ్ గాంధీ కాలనీ, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సర్కిల్, మున్సిపల్ ఆఫీస్ మీద పోలీస్ స్టేషన్ వరకు కొన‌సాగింది. ఈసంద‌ర్భంగా కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ గొడవలు, అల్లర్లులేని హింసారహిత ఎన్నికలే తమ లక్ష్యమని తెలిపారు.ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేలా పోలీసులు పరిస్థితులు కల్పించడమే ఈ కవాతు ఉద్ధేశ్యమని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసుల పర్యవేక్షణలో కొనసాగిన ఈ కవాతు ద్వారా ప్రజల్లో భరోసా కల్గింది. కార్య‌క్ర‌మంలో రాయదుర్గం సిఐ శ్రీనివాస్, రాయదుర్గం రూరల్ సీఐ ప్రసాద్, గుమ్మగట్ట ఎస్సై వెంకటేశ్వర్లు, కనేకల్లు ఎస్సై శ్రీనివాస్, డి.హీరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, బొమ్మనహాళ్ ఎస్సై శ్రీనివాస్, బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ దళపతి, సబ్ ఇన్స్పెక్టర్లు మనోజ్ కుమార్, రాజన్ త్యాగి, కుల్దీప్ సింగ్ రాథోడ్ లు, రాయదుర్గం రూరల్ సర్కిల్ , యుపిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *