సిరా న్యూస్,మంథని;
మంథని నియోజకవర్గములోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడ లో శ్రీ దత్తాత్రేయ, శివపార్వతి,గణపతి, ఆదిత్య నందికేశ్వర భక్తాంజనేయ ఆలయ 3వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు మంథని నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గంలోనికి ఆయన వాహనం ప్రవేశించగానే కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. మంథని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామాన ఆయన వాహనాన్ని ఆపి స్వాగతం పలికారు. అనంతరం ధన్వాడ గ్రామానికి భారీ కాన్వాయ్ తో తరలి వెళ్లారు.
==========================xxx