సిరా న్యూస్, జైనథ్
ఘనంగా దుద్ధిల్ల శ్రీపాద రావు జయంతి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల ప్రజా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసన సభ స్పీకర్ కీ.శే. దుద్ధిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు అభివృద్ధి అధికారి ఎ. రవీంద్రనాథ్ ,కార్యాలయ పర్యవేక్షకులు జి. ముత్యం రావు,స్థానిక ఎంపీటీసీ సభ్యలు కోడిచర్ల సుదర్శన్, తుమ్మల వెంకటరెడ్డి , ప్రశాంత్ రెడ్డి,జగదీశ్ రెడ్డి, దిలీప్, వేంకటరెడ్డి (ఖాప్రి), కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథక సిబ్బంది పాల్గొన్నారు.