SRIVARI BRAHMOTSAVAM: కమనీయంగా శ్రీవారి కళ్యాణో త్సవం…

సిరా న్యూస్, కుందుర్పి
*కమనీయంగా శ్రీవారి కళ్యాణో త్సవం…
*కుందుర్పిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు….

మండల కేంద్రమైన కుందుర్పిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మూడవరోజు కొనసాగాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం అత్యంత కమ్నీయంగా జరిగింది. విశేష జనల మధ్య వేద పండితుల మంత్రాత్సవం నడుమ శ్రీవారి కల్యాణోత్సవం కమనీయంగా చేప‌ట్టారు.శ్రీవారికి భక్తాదులు ఆర్థిక కానుకులను సమర్పించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ పుణ్య శ్రీవారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకిస్తే భక్తాదులకు అత్యంత పుణ్యం లభిస్తుందని అర్చకులు చెప్పారు. తొలత ఉదయం ఆలయంలో స్వామివారికి వేద పండితుడు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఉదయం నిత్య హోమము, బలిహరణం, గ్రామ ఉత్సవం, సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం పైన కలశ స్థాపన కార్యక్రమాలు తప్పట్ల మోదుతో మంగళ వాయిద్యాలు నడుము చేపట్టారు. స్వామివారిని విష్ణు చక్రం పల్లకిలో అధిష్టాంపజేసి గ్రామ పురవీధుల గుండా మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి శెమివృక్చం దాకా ప్రదర్శన కొనసాగింది. ఆలయంను ఎదట రాత్రి భారీ ఎత్తున బాణసంచా పేల్చి భక్తి భావాన్ని చాటుకున్నారు. అంతకు మునకు అత్యంత సుందరంగా వెలసిన వెంకటేశ్వర దేవాలయానికి పచ్చటి తోరణాలతో రంగురంగుల విద్యుత్ దీపాలతో చూపరులను అలంకరించడం విశేషం. అనంతరం బండమీద పల్లి గ్రామస్తులు ఆధ్వర్యంలో సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,ధర్మకర్త, గ్రామస్తులు, యావన్మంది భక్తాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *