అయోధ్యకు శ్రీవారి లడ్డూలు…

తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక కార్గో ఛాపర్ ద్వారా తరలింపు
సిరా న్యూస్,తిరుపతి;
రామజన్మభూమి అయోధ్యకు శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలను టీటీడీ తరలించింది. 22వ తేది దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. శుక్రవారం సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి లక్ష లడ్డూల శనివారం ఉదయం తిరుపతి ఎయిర్పోర్ట్ తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కుందన్నారు. లక్ష లడ్డూలను తయారు చేసి, శుక్రవారం ప్రత్యేకంగా పాకింగ్ చేయించారు . శనివారం తిరుపతి విమానాశ్రయం నుండి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు లడ్డూలు చేరుకున్నాయి. ఈలడ్డూలను . 22వ తేదీన అయోధ్యలో భక్తులకు ప్రసాదంగా పంపిణి చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *