సిరాన్యూస్, ఖానాపూర్
మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి :ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. ఆ పథకంపై మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. మహిళాల ఏం మాత్రం గౌరవం లేకుండా చేసిన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోవాలన్నారు.