Stand With Specially Abled Employees: దివ్యాంగుల ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి కృషీ

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

దివ్యాంగుల ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి కృషీ
– రాష్ట్ర ఉపాధ్యాక్షులు చిల్కూరి మహేందర్‌ రెడ్డి
+ 21న సభ్యత్వ నమోదుకు తరలిరావాలని పిలుపు

దివ్యాంగులైన ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాద్యాక్షులు చిల్కూరి మహేందర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 21 మంది సభ్యులు సంఘంలో సభ్యత్వం తీసుఉన్నట్లు తెలిపారు. కాగా మరల ఈ నెల 21న సమావేశం ఉంటుందని, ప్రతీ ఒక్క దివ్యాంగులైన ఉద్యోగి సంఘంలో తప్పక సభ్యత్వం తీసుకోవాలని కోరారు. దివ్యాంగ ఉద్యోగులకు ఏ సమస్యలున్నా 9182389006, 9866753861 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు దారట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జాన్‌ముఖీం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *