తలక్రిందులగా నిలబడి నిరసన

ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో కార్యాలయంలో ఘటన
సిరా న్యూస్,ఇబ్రహీంపట్నం:
ధరణి లోపాల కారణంగా బాధితులు ఇంకా కార్యాలయాల చుట్టు తిరుగుతునే ఉన్నారు.మండల కార్యాలయంలోనే పరిష్కరించ దగ్గ సమస్యను పరిష్కరించకుండా అశ్రద్ధ వహిస్తున్నారు. దీంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం మంగళ్ పల్లి సర్వే నెంబర్ 374 లోని 1-32 గుంటల భూమిని నిషేధిత జాబిత నుండి తొలగించాలని 8 నెలల నుండి ఆఫీస్ చుట్టు తిరిగిన ప్రయోజనం లేదంటు ముంబాయి టాటా ఇన్స్టిట్యూట్ ఆప్ సోషల్ సైన్సెస్ లో గోల్డుమెడల్ సాధించిన జీవన్ తన భూ సమస్య పరిష్కరించండంలో అధికారులు విఫలం చెందారని,ఉన్నత చదువులు చదివిన తనకే ఇలాటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల కు అధికారులు ఎలా అందుభాటులో ఉంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. ధరణీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏమ్మర్వో కార్యాలయంలో తలక్రిందులుగా నిలబడి తననిరసనను తెలిపారు. దీంతో తహసిల్దార్ నా దృష్టికి ఇప్పుడే వచ్చిందిదని 20 రోజులోగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *