స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల బాండ్లను వివరించాలి

సిరా న్యూస్,ఎమ్మిగనూరు;

కేంద్రంలోని అధికార బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఎన్నికల నిర్వహణ పేరుతో ఎలక్షన్ బాండ్లను సేకరించి ఆడబ్బుతో ఓట్లు కొని, మళ్లీ అధికారంలో రావడానికి సిద్ధమైందని సిపిఎం పార్టీ నాయకులుపి. గోవిందు,బి.రాముడు తీవ్రంగా ఆరోపించారు. సోమవారం స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఎన్నికల బార్లను రద్దు చేసిందని తెలిపారు. ఎన్నికల బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోప్యంగా ఉంచడాన్ని ఆయన తప్పు పట్టారు. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల వివరాలను ఎలక్షన్ కమిషన్కు అందజేయాలని కోరింది. కానీ ఎస్బిఐ ఆ వివరాలను వెల్లడించకుండా కేంద్రానికి తలోగ్గిందని ఆయన ఆరోపించారు. మోడీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలోనే వివరాలు వెల్లడించడానికి జూన్ వరకు సమయం కోరిందని తెలిపారు. ఏప్రిల్, మే మాసంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ బాండ్ల వివరాలను గోప్యంగా ఉంచడం పరోక్షంగా బిజెపికి సహకరించడమే అని ఆరోపించారు. ఎన్నికల బాండ్లను ఉపయోగించుకొని ఆ డబ్బుతో ఓట్లు కొని బిజెపి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఇప్పటికైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే ఎన్నికల కమిషన్కు అందజేయాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మీ నరసయ్య, కృష్ణ, రాజు, నాగరాజు, చంద్ర, శంకర్, ముక్తార్, మాదన్న, రాముడు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నార.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *