ట్యాంకర్ నుంచి ఆవిరి విడుదల

కళ్లు మండడంతో స్థానికుల అందోళన
సిరా న్యూస్,జూపూడి;
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం వద్ద ఆగివున్న ఒక ట్యాంకర్ నుండి ఆవిరి రూపంలో బయటకు వచ్చే లిక్విడ్ తో అక్కడివారి కళ్ళు మండిపోతూ భయభ్రాంతులకు గురిచేసింది. గత రాత్రి సుమారు రెండుగంటల సమయంలో కంచికచర్ల నుండి విజయవాడ వైపు వెళ్ళు దారిలో జూపూడి పవన్ క్రషర్స్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైన ట్యాంకర్ ను పవన్ క్రషర్స్ వద్ద పక్కనే ఆపివేయడంతో దాని నుండిఆవిరి రూపంలో లిక్విడ్ బయటికి వస్తూ రోడ్డు మొత్తం తడిచి పోయింది. ఆవిరి రూపంలో బయటకు వచ్చే లిక్విడ్ వలన ఆ ప్రాంతానికి వెళితేనే కళ్ళు మండిపోతూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. కనీసం ఆ వాహనానికిసంబంధించిన వారెవరు ఆ ప్రాంతంలో లేకపోవడంతో దాని లోపల ఉన్న లిక్విడ్ ఎటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుందో అన్న ఆందోళనలో స్థానికులు ఉన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఆ లిక్విడ్ ను బయటికిరాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *