సిరా న్యూస్, ఖానాపూర్:
కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేయండి…
+ అధికారులకు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆదేశం
+ పునరావాస గ్రామాల్లో నిర్మిస్తున్న ఇండ్లు, సిసి రోడ్, పనులు పరిశీలన
పునరావాస గ్రామాల్లో నిర్మిస్తున్న ఇండ్లు, సిసి రోడ్, డ్రైనేజీ, ఇతరత్రా పనుల్లో నాసిరకంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు నిలిపివేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆదేశించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లోని కొత్త మద్దిపడగ గ్రామం వద్ద నిర్మిస్తున్న పునరావాస గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లు, సిసి రోడ్డు, డ్రైనేజీ, పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కవ్వాల్ టైగర్ జోన్ తరలింపు గ్రామాలైన మైసంపేట్, రాంపూర్ గ్రామాల ఆదివాసులు తమ గ్రామాలను వదిలి పునరావాస గ్రామానికి రావాలంటే నాణ్యమైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని అన్నారు. లేనియెడల వారితోపాటు తాను కూడా ఆందోళన చేపడుతానని ఎమ్మెల్యే హెచ్చరించారు. పునరావాస కేంద్రాల వద్ద కొనసాగుతున్న పనులు నాసిరకంగా ఉన్నాయని, నాణ్యతతో చేపట్టాలని ఆయన ఆదేశించారు.