సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా దవ్వురు గ్రామానికి చెందిన తెనుగు శిరీష(18) గురువారం రాత్రి హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది తెలిపారు. చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో నెలకొన్న బాసర ట్రిపుల్ ఐటీలో ఎప్పుడు ఏదో ఒక కారణం వలన విద్యార్థుల బలిదానాలు ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వ్యక్తిగత సమస్య వల్లనే ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యల నివారణకు క్యాంపస్ లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటాలేరని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్లో వెళ్ళకుండా మీడియా పై ఆంక్షలు విధించారు. విద్యార్థులు, మీడియాతో మాట్లాడితే నిజ నిజాలు తెలుస్తాయి. క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుల సమస్యల పరిష్కారానికి బారికేడ్లు తొలగించి ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ లో మార్చి సామాన్యులకు అనుమతి కల్పించింది. గత ప్రభుత్వం హయాంలో మీడియాపై ఆంక్షలు ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆంక్షలు ఎత్తివేసి మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు. అదేవిధంగా బాసర ట్రిపుల్ ఐటీలో మీడియాకు ప్రవేశం కల్పించి క్షేత్ర స్థాయిలో విద్యార్థుల సమస్యలు, ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకోవచ్చు. అధికారులు నిర్లక్ష్యమా లేక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.