సిరా న్యూస్,మహబూబ్ నగర్;
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటన్ సమీపంలో గల మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాలలో ఇంటర్ 2 సంవత్సరం చదువుతున్న రామ్ రెడ్డి అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీంతో విద్యార్థి మృతి చెందడం పై విద్యార్థి బందువులు ఆందోళన కు దిగారు. కళాశాలలో ఉన్న ఫర్నిచర్ సామగ్రిని ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రికత నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులకు శాంతింప జేశారు.