Students: విద్యార్థులకు బ్యాండ్ డ్రమ్స్ అందజేత

బేల, సిరా న్యూస్ 

విద్యార్థులకు బ్యాండ్ డ్రమ్స్ అందజేత

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆడనేశ్వర ఫౌండేషన్ -జడ్పీటీసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ 7  వేల విలువగల బ్యాండ్ డ్రమ్స్ లను శుక్రవారం ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ గంభీర్ ఠాక్రే, బేల మాజీ సర్పంచ్ మస్కె తేజ రావు, స్థానిక సర్పంచ్ దౌలత్ రావు, నాయకులు యాసం సతీష్, షాలిక్ నకతే స్కూల్ ఛైర్కన్ సంతోష్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *