చిగురుమామిడి, సిరా న్యూస్
పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదని సీడీపీవో సబిత అన్నారు. శుక్రవారం మండలంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్నేహిత కార్యక్రమం ఇందుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రభుత్వ పాఠశాలలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. బాల బాలికలు యుక్త వయస్సులో మార్పుల వలన తెలిసి తెలియక ఎక్కువ ప్రేమకు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. సినిమాలో, సీరియల్ లో చూపించే ప్రేమ చిత్రాలు ప్రేమ వరకే చూపిస్తారు. పెళ్లి తరువాత వచ్చే కష్టాలను చూపించరని తెలిపారు, చరవాణి ద్వారా కూడా కొందరు పిల్లలు ఎక్కువగా చెడు మార్గంలో పోతున్నారు. చరవాణి వాడే సమయంలో వచ్చే వివిధ అశ్లీల ప్రకటనల ద్వారా ఆకర్షితులు అయి అలాంటివి ఎక్కువగా చూస్తున్నారు, దాని ద్వారా మోసపోతున్నారు, చరవాణికి, సోషల్ మీడియా వివిధ సామాజిక మాధ్యమాల పెట్టుకునే పాస్ వర్డ్ ల గురించి కూడా వివరించారు. వాట్సాప్, ఫేస్ బుక్ లో అమ్మాయిలు ఫొటోస్ ఎక్కువ పెట్టవద్దున్నారు. కార్యక్రమంలో డాక్టర్ మాధురి కార్యదర్సి వెంకటరమణారెడ్డి, ఏఎన్ఏం కవిత, ఏఈవో సతీష్, సీఏ లావణ్య ఉపాధ్యాయ బృందం అంగన్వాడీ టీచర్లు,విద్యార్థులు పాల్గొన్నారు.